English | Telugu

"తను వెడ్స్ మను" లో సాయిరాం, ఛార్మి

సాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు. కంగనా రనౌత్ ‍, మాధవన్ కలసి నటించగా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన "తను వెడ్స్ మను" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ చిత్రంలో హీరోగా సాయిరాం శంకర్, హీరోయిన్ గా ఛార్మి నటించబోతున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సొంతం చేసుకున్నారు.

చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, దిల్ రాజు కలసి నిర్మిస్తారట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఛార్మి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో నటిస్తుంది. ఆ కారణంగానే పురీ జగన్నాథ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.