English | Telugu

సల్మాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నోటీసు


సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకను వేటాడిన కేసులో సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆ కేసులో కోర్టు విధించిన శిక్షపై ఇచ్చిన స్టేను ఎందుకు తొలగించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు బుధవారం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పదహారేళ్లుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింక వేట కేసు విషయంలో కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. 1998 అక్టోబర్ 1-2 తేదీల రాత్రి రాజస్థాన్లో జోధ్‌పూర్ సమీపంలోని మథానియా, కంకణిలో కృష్ణజింకలను వేటాడినట్లు సల్మాన్ ఖాన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంలో సల్మాన్ ఖాన్ ఒక కష్ణజింకను, రెండు చింకారా జింకలను వేటాడినట్టు అభియోగాలున్నాయి. ఈ కేసులో ఆ సినిమాలో సహ నటులైన సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలం కూడా నిందితులుగా ఉన్నారు. జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం సల్మాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.