English | Telugu

ఆగష్టు 23న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పాటల పండగ



మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం ఆడియో ఆల్బం ను ఆగష్టు 23 న భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. అలాగే సెప్టెంబర్ 24న భారీ స్థాయి లో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం లో హీరో కారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది అని, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నే ఒక మయిలురాయి గా నిలిచే చిత్రం అవుతుంది అని దర్శకులు హరీష్ శంకర్ చెబుతున్నారు.

"ప్రెక్షకులను, మెగా ఫ్యామిలీ అభిమానులను అలరించటానికి, మెగాస్టార్ చిరంజీవి గారి పాటను రీమిక్స్ చెసాము. ఇది ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది " అని నిర్మాత దిల్ రాజు అన్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చే చిత్రాలకు ఉండే ఉన్నతమైన సాంకేతిక విలువలు, హరీష్ శంకర్ రాసే పదునైన సంభాషణలు, సాయి ధరం తేజ్ అధ్బుతమైన డాన్స్ మరియు నటన, రెజినా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది. అమెరికా లో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. సాయి ధరమ్ తేజ్, రెజినా , నాగబాబు, కోటా శ్రీనివాస రావు, పృథ్వి, రావు రమేష్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి : C రామ్ ప్రసాద్ . ఎడిటింగ్ : గౌతం రాజు . ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, వెంకట్ . స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్ . కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్. నిర్మాత - దిల్ రాజు. కథ - మాటలు - దర్శకత్వం : హరీష్ శంకర్. ఎస్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.