English | Telugu

కొర‌టాలకు కిక్కు నెత్తికెక్కిందా?

విజ‌యంతో పాటు 'విన‌యం' కూడా కల‌సి రావాలి అనిచెప్తుంటారు పెద్ద‌లు. విజ‌యం తాలుకు గ‌ర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా, ఎన్ని విజ‌యాలొస్తే అంత త‌లొగ్గి ఉండ‌డ‌మే అస‌లు సిస‌లైన విజేత ల‌క్ష‌ణం. అయితే ఈ టైపు క్యారెక్ట‌ర్ల‌ను తెలుగు చిత్ర‌సీమ‌లో అరుదుగానే క‌నిపిస్తుంటారు. ఒక్క హిట్టు ప‌డ‌గానే అంతా తామే చేసిన‌ట్టు పోజులు కొడుతుంటారు. త‌మ వెనుకే ప్ర‌పంచం ప‌రుగులు పెడుతున్న‌ట్టు ఫీలైపోతుంటారు. ఇప్పుడు కొర‌టాల శివ‌కూ అలాంటి కిక్కే నెత్తిమీద ఎక్కిందా అనిపిస్తుంటుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీ‌మంతుడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకెళ్లిపోతుంది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కూ మార్కులు ప‌డ్డాయి.

ఆ మాత్రం చేత ఆ సినిమాలో లోపాలు లేక‌పోలేదు క‌దా. ఇదే విష‌యం కొర‌టాల‌ని అడిగితే ఆయ‌న‌కు కాస్త కోపం వ‌చ్చింది. త‌ల‌తిక్క స‌మాధానాల‌తో పాత్రికేయుల్ని కాసేపు తిక‌మ‌క‌పెట్ట‌డానికి ట్రై చేశారాయ‌న‌. ఆదివారం హైద‌రాబాద్ లో శ్రీ‌మంతుడు ప్రెస్ మీట్ జ‌రిగింది. క‌న్న‌కొడుకు ఎక్క‌డికెళ్లాడో, ఏం చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్య‌త తండ్రికి ఉండదా? ఆ పాయింట్‌ని ఎందుకు మిస్ అయ్యారు అన్న ఓ పాత్రికేయుడి ప్ర‌శ్న‌కు కాస్త వెట‌కారంగా, ఇంకాస్త ఘాటుగా స‌మాధానం ఇచ్చాడు కొర‌టాల‌. అలాంటి సీన్ల‌న్నీ చేరిస్తే సినిమా తొమ్మిది గంట‌ల‌వుతుందండీ. అంత అవ‌స‌ర‌మా?? అని ఎదురు ప్ర‌శ్నించాడు. మ‌రో ప్ర‌శ్న‌కు రైతు కూలీలు ఊరు వ‌దిలి వెళ్ల‌కూడ‌దు, వెళితే నేనైతే కొట్టి ఆపుతా.. అన్నాడు. ఈ స‌మాధానాలే చెబుతాయి ఈ ద‌ర్శ‌కుడికి విజ‌యాల కిక్కు ఎక్కేసింద‌ని. అయితే మ‌రో వైపు మ‌హేష్ మాత్రం అన్నింటికీ న‌వ్వుతూ, చాలా బ్యాలెన్స్‌గా స‌మాధానాలు చెప్పుకొచ్చాడు. సూప‌ర్ స్టార్లు ఊర‌కే అవుతారా. ఈ విష‌యం కొర‌టాల ఎప్పుడు తెలుసుకొంటాడో.?

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.