English | Telugu

నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్

నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వేళితే ప్రముఖ సినీ ఫైనాన్సియర్, నిర్మాత అయిన సింగనమల రమేష్ నిన్న చెన్నై శివార్లలో సి.ఐ.డి. పోలీసుల చేతిలో అరెస్ట్ చేయబడ్డాడు. సింగనమల రమేష్ ని ముందుగా చెన్నై కోర్టులో హాజరు పరచి ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకు వస్తారని తెలిసింది. ప్రొద్దుటూరుకు చెందిన సింగనమల రమేష్ "ఖలేజా", "కొమరంపులి" వంటి భారి సినిమాలను నిర్మించారు. సింగనమల రమేష్ కు మద్దులచెరువు సూరిని హత్యచేసిన భాను కిరణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయనీ, భాను కిరణ్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో సింగనమల రమేష్ ఆధీనంలోనే ఉన్నాయనీ సి.ఐ.డి.పోలీసుల వాదన.

సింగనమల రమేష్ ను పట్టుకుంటే భానుకిరణ్ ని పట్టుకోవటానికి మార్గం సుగమమవుతుందని వారంటున్నారు. అంతే కాక హైదరాబాద్ లో ఒక సినీ ఫైనాన్సియర్ ని బెదిరించిన కేసులో, భానుకిరణ్ తో పాటు సింగనమల రమేష్ కూడా ఉన్నాడని ఇక్కడ కేసు నమోదయ్యింది. మద్దుల చెరువు సూరి హత్య జరిగిన తర్వాత సుమారు ఒక అయిదు నెలల నుండీ సింగనమల రమేష్ పరారీలో ఉన్నాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.