English | Telugu

నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్

నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వేళితే ప్రముఖ సినీ ఫైనాన్సియర్, నిర్మాత అయిన సింగనమల రమేష్ నిన్న చెన్నై శివార్లలో సి.ఐ.డి. పోలీసుల చేతిలో అరెస్ట్ చేయబడ్డాడు. సింగనమల రమేష్ ని ముందుగా చెన్నై కోర్టులో హాజరు పరచి ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకు వస్తారని తెలిసింది. ప్రొద్దుటూరుకు చెందిన సింగనమల రమేష్ "ఖలేజా", "కొమరంపులి" వంటి భారి సినిమాలను నిర్మించారు. సింగనమల రమేష్ కు మద్దులచెరువు సూరిని హత్యచేసిన భాను కిరణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయనీ, భాను కిరణ్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో సింగనమల రమేష్ ఆధీనంలోనే ఉన్నాయనీ సి.ఐ.డి.పోలీసుల వాదన.

సింగనమల రమేష్ ను పట్టుకుంటే భానుకిరణ్ ని పట్టుకోవటానికి మార్గం సుగమమవుతుందని వారంటున్నారు. అంతే కాక హైదరాబాద్ లో ఒక సినీ ఫైనాన్సియర్ ని బెదిరించిన కేసులో, భానుకిరణ్ తో పాటు సింగనమల రమేష్ కూడా ఉన్నాడని ఇక్కడ కేసు నమోదయ్యింది. మద్దుల చెరువు సూరి హత్య జరిగిన తర్వాత సుమారు ఒక అయిదు నెలల నుండీ సింగనమల రమేష్ పరారీలో ఉన్నాడు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.