English | Telugu

శంక‌ర్ దృష్టిలో బ్యాడ్ అయిన సూర్య‌!

శంక‌ర్ ఇప్పుడు ఒక‌టికి రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. పాతికేళ్ల‌కు పైబ‌డిన ఇండియ‌న్ మూవీ సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో గేమ్ చేంజ‌ర్ చేస్తున్నారు. ఒక‌టికి రెండు సినిమాలు చేస్తున్నప్పుడు, రెండిటిలోనూ విల‌న్లు కావాలి. మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న తెలుగు మూవీ కోసం ఎస్‌.జె.సూర్య‌ని సెల‌క్ట్ చేసుకున్నారు. మ‌రి ఇండియ‌న్‌2 కోసం ఎవ‌రు వ‌చ్చారు? ఇండియ‌న్‌2 లోనూ ఎస్‌.జె.సూర్య‌నే విల‌న్ అట‌. ఇండ‌స్ట్రీలో మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌నాలిటీల్లో ఎస్‌.జె.సూర్య ఒక‌రు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోతారు. స‌ర్‌కాస్టిక్ కామెడీతో పాటు, విల‌నిజం కూడా ఆయ‌న స్పెష‌ల్‌. ఇప్పుడు దాన్నే వాడుకుంటున్నార‌ట శంక‌ర్‌. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ అన్ని సినిమాల పేర్లూ చెప్పిన సూర్య‌, ఇంకో భారీ బ‌డ్జెట్ సినిమా ఉంది. అది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ అనేశారు. అంతలోనే క‌మ‌ల్‌హాస‌న్‌తో త‌న‌కున్న రిలేష‌న్‌ని త్వ‌ర‌లోనే రివీల్ చేస్తాన‌ని మ‌రో చోట అన్నారు. వాట‌న్నిటినీ గ‌మ‌నించిన ఫ్యాన్స్ క‌మ‌ల్ మూవీలో ఎస్‌.జె.సూర్య న‌టిస్తున్నారంటూ గెస్ చేశారు. ఇప్పుడు అది నిజ‌మ‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

ఇండియ‌న్2 మూవీలో ఎస్‌.జె.సూర్య కేర‌క్ట‌ర్ చాలా బాగా వ‌చ్చింద‌ట‌. ఉల‌గ‌నాయ‌గ‌న్ ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ అయ్యేలా ఉంటాయ‌ట స‌న్నివేశాలు. అందులోనూ క‌మ‌ల్‌, సూర్య క‌లిసే షాట్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అంటున్నారు యూనిట్ మెంబ‌ర్స్. సూర్య న‌టిస్తున్న విష‌యాన్ని గోప్యంగా ఉంచాల‌ని అనుకున్నార‌ట శంక‌ర్‌. అందుకే ఇన్నాళ్లూ చెప్ప‌లేద‌ట‌. ఇప్పుడు సూర్య పోర్ష‌న్ కంప్లీట్ అయింది. ఇండియ‌న్ సినిమాతో పోల్చుకుంటే భార‌తీయుడు2 ప‌ది రెట్లు గొప్ప‌గా ఉంటుంద‌ని అన్నారు సిద్ధార్థ్‌. ఇండియ‌న్‌2 గురించి వీళ్లు చెబుతున్న మాట‌లు సినిమా మీద హైప్ పెంచుతున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.