English | Telugu

జీవితానికి గ్యారంటీ లేదు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరోలు నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). సౌత్ ఇండియాలో తెరకెక్కిన మరో అతి పెద్ద మల్టిస్టారర్ మూవీగా, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పుష్ప 2 , యానిమల్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన నేషనల్ క్రష్ 'రష్మిక'(Rashmika Mandanna)హీరోయిన్. దీంతో 'కుబేర' కి పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి 'హైదరాబాద్'(Hyderabad)లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అభిమానులని ఉద్దేశించి రష్మిక మాట్లాడుతు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంతో నాకు చాలా భయమేస్తుంది. ఈ మధ్య నేను ఎక్కువగా విమానాల్లోనే జర్నీ చేస్తున్నాను. దాంతో ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే భయం పట్టుకుంది. మన జీవితాలకి గ్యారంటీ లేదనే విషయం కూడా అర్ధమయ్యింది. ఫంక్షన్ తర్వాత మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ సినీ రంగానికి చెందిన రష్మిక 2016 లో' కిరాక్ పార్టీ' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కన్నడంలోనే అంజనీ పుత్ర, చమక్ అనే చిత్రాల్లో నటించి, 2018 లో 'నాగ శౌర్య' హీరోగా వచ్చిన 'ఛలో' మూవీతో తెలుగు నాట అడుగుపెట్టింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 , సీతారామం, వారిసు, యానిమల్, చావా వంటి చిత్రాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. దీంతో' కుబేర' పై అందరిలో అంచనాలు పెరిగాయి. క్రైమ్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన కుబేర కి 'శేఖర్ కమ్ముల'(Sekhar Kammula)దర్శకుడు. సునీల్ నారంగ్(Suniel Narang),పి రామ్మోహనరావు(p.Ram Mohan Rao)తో కలిసి శేఖర్ కమ్ముల నే నిర్మించాడు. ఈ నెల 20 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.