English | Telugu

సమంత చేయాల్సిన 'రెయిన్ బో' రష్మిక చేస్తుందా!

స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించే హీరోయిన్లు అరుదుగా ఉంటారు. ఈ తరంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న హీరోయిన్లు అంటే అనుష్క, సమంత పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. 'అరుంధతి', 'భాగమతి', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో అనుష్క ఆకట్టుకోగా.. 'ఓ బేబీ', 'యూ టర్న్', 'యశోద' వంటి సినిమాలతో సమంత అలరించింది. త్వరలోనే ఆమె 'శాకుంతలం' సినిమాతో కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క, సమంత బాటలో మరో స్టార్ హీరోయిన్ పయనించబోతోంది.

తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. 'పుష్ప' సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది. 'సామి సామి' అంటూ నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం 'పుష్ప-2', 'యానిమల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా ఓ ఫిమేల్ సెంట్రిక్ ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి శాంతరూబన్‌ దర్శకుడు. ఈ సినిమాకి 'రెయిన్ బో' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. సోమవారం ఉదయం ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

నిజానికి సమంత ప్రధాన పాత్రలో శాంతరూబన్‌ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ 2021 లో ఓ సినిమాని ప్రకటించింది. ఇప్పుడదే ప్రాజెక్ట్ లోకి సమంత స్థానంలో రష్మిక వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో అనుష్క, సమంత మాదిరిగా రష్మిక కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.