English | Telugu

రజనీ కాంత్ కి చెన్నైలో ఘనస్వాగతం

రజనీ కాంత్ కి చెన్నైలో ఘనస్వాగతం ఏర్పాటుచేయటానికి ఆయన అభిమానులు వేలాదిగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారట. రజనీ కాంత్ సింగపూర్ నుండి చెన్నైకి ఈ రోజు సాయంత్రం వస్తున్నారు. రజనీ కాంత్ తాను హీరోగా నటిస్తున్న "రాణా" మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత రజనీ కాంత్ ఆరు వారాల పాటు సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ సెంటర్ లోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో ట్రీట్ మెంట్ తీసుకుని నేడు చెన్నైకి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు వేలాదిగా చెన్నై ఎయిర్ పోర్ట్ కు తరలి వస్తున్నారు.

ఆయన రాకతో కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో, రజనీ కాంత్ హీరోగా, దీపిక పదుకునే, ఇలియానా హీరోయిన్లుగా నటించబోయే "రాణా" చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే దీపిక పదుకునే డేట్లు ఖాళీ లేకపోవటంతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశముంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.