English | Telugu

అప్పుడు బాహుబలికి ఇప్పడు రజినీకీ - నో నో


సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాను రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్ గ్రామస్థులు అడ్డుకున్నట్లు సమాచారం. 'లింగా' చిత్ర షూటింగ్ కోసం యూనిట్ అక్కడకు వెళ్లగా వారిని గ్రామస్తులు అపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. షూటింగ్ నిర్వహింటడం వలన చెరువులో రసాయనాలు కలుస్తున్నాయని ఆ గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. చెరువు కలుషితమవుతున్న విషయాన్ని అధికారులకు తెలియచేస్తామంటున్నారు. అయితే చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ జరుపుకునేందుకు పర్మీషన్ తీసుకున్నట్లు తెలుపుతున్నారు. గతంలో బాహుబలి చిత్ర షూటింగ్ సమయంలో అనాజ్ పూర్ గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
లింగా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, అనుష్క, సోనాక్షి కథానాయికలుగా నటిస్తున్నారు. దాదాపు 15 రోజులుగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.