English | Telugu

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)నాలుగున్నర దశాబ్దాల ఆయన సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు(p v narasimha rao)అంతటి వ్యక్తే రాజేంద్ర ప్రసాద్ అభిమాని. దీన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గ మొదలుపెట్టి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇప్పుడు మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.రీసెంట్ గా విడుదలైన 'లగ్గం' మూవీలో ప్రధాన పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో భాగస్వామ్యమయ్యాడు.

రీసెంట్ గా అయన ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఫాడ్ కాస్ట్ లో మాట్లాడుతు ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను.కానీ స్కూల్ టీచర్ అయిన మా నాన్నకి మాత్రం నేను వెళ్లడం ఇష్టం లేదు.నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు,అక్కడ నువ్వు ఫెయిల్ అయినా, విజయం సాధించినా అదంతా నీకు సంబంధించిన విషయం.ఫెయిల్ అయితే మాత్రం ఇంటికి రావద్దని చాలా కఠినంగానే చెప్పాడు. ఇక ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ కూడా సాధించాను.కానీ అవకాశాలు రాకపోవడంతో చేసేది లేక ఇంటికి వెళ్ళాను. కానీ ఎందుకొచ్చావురా అని మా నాన్న కోప్పడటంతో మళ్ళీ చెన్నై వచ్చాను. కానీ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని, ఒకసారి తెలిసిన వాళ్ళందర్నీ చూడాలని వాళ్ళ ఇళ్ళకి వెళ్లి మాట్లాడాను.

చివరిసారిగా ప్రముఖ నిర్మాత పండరి కాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్ళాను.ఆ టైం లో ఆయన కొత్త మూవీ 'మేలుకొలుపు' సినిమాకి సంబంధించిన గొడవ ఏదో జరుగుతూ ఉంది. ఆయన నన్ను చూడగానే ఏం మాట్లాడకుండా ఒక సీన్ కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకి నచ్చి భలే దొరికావని చెప్పి రెండో సీన్ కి కూడా డబ్బింగ్ చెప్పమంటే, భోజనం చేసి మూడు నెలలు అయ్యింది,భోజనంపెడితే డబ్బింగ్ చెప్తానంటే ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాననే విషయం చెప్పే సరికి నన్ను కోప్పడ్డారు.ఆ తర్వాత కంటిన్యూగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాను.అలా వచ్చిన డబ్బుతో మద్రాస్ లో ఇల్లు కూడా కట్టాను.ఆ తర్వాత దర్శకుడు వంశీ పరిచయమవ్వడంతో అతని సినిమాల ద్వారానే హీరోగా పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గ నిలిచాయి. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ కుమార్తె చనిపోయిన విషయం తెలిసిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.