English | Telugu

రామ్ చరణ్ రచ్చ కథ ఇదేనా

రామ్ చరణ్ "రచ్చ" కథ ఇదేనని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే యువ హీరో మెగాస్టార్ ఏకైక కుమారుడూ, ఆయన నట వారసుడూ అయిన రామ్ చరణ్ తేజ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, " ఏమైంది ఈ వేళ " ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. "రచ్చ" మూవీ కోసమే రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో ఒక అంతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణపోంది మరీ కండలు పెంచి, ఎయిట్ ప్యాక్ తో తిరిగొస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే మంచి నీళ్ళలో ఫ్లోరైడ్ అధిక శాతం ఉండటం వల్ల, తెలంగాణా ప్రాంతాలైన నల్గొండ, మెహబూబ్ నగర్ జిల్లాలలో ప్రజలు ఎంతటి అనారోగ్యానికి గురవుతున్నారో, వారికి మంచి నీళ్ళు అందించటానికి హీరో చేసే రచ్చే ఈ "రచ్చ" చిత్రానికి కథని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. బహుశా ఇది నిజం కావచ్చు...కాకపోవచ్చు కూడా. ఏదేమైనా "రచ్చ"తో రామ్ చరణ్ త్వరలో రచ్చ రచ్చ చేయటానికి వస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.