English | Telugu

'రభస' యంగ్ టైగర్ ఎంట్రీ ఇచ్చాడు

రభస ఆడియో ఫంక్షన్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ వచ్చిన వెంటనే హీరోయిన్లు సమంత, ప్రణీత కూడా వచ్చారు. యంగ్ టైగర్ ఎంట్రీతో ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటూ 'రభస' 'రభస' చేశారు. ఈ ఫంక్షన్ కి వి.వి. వినాయక్, దిల్ రాజు, బండ్ల గణేష్ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ..ఆది, బృందావనం కలిపితే రభస అని, ప్రతి సినిమాలో ఎన్టీఆర్ ఏదోకటి కొత్తదనంగా చేయాలని చూస్తారని చెప్పారు. మూడో సాంగ్ ను ఆయన రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.