English | Telugu

'రభస' ఆడియోలో కన్నీరు పెట్టుకున్న డైరెక్టర్

జూనియర్ ఎన్టీఆర్ 'రభస' ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. అందుకు కారణం కూడా ఆయన వివరించాడు. 'రభస' షూటింగ్ టైంలో నాకు జాండిస్ వచ్చాయి. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నాకు కోసం ఎదురుచుశాడు. నీకేం కాదు. నువ్వు ముందు కోలుకో.. నీకు నేను అండగా నేనున్నానంటూ ఎన్టీఆర్ నాకు ధైర్యం చెప్పారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. భావోద్వేగానికి గురైన సంతోష్ శ్రీనివాస్ ను ఎన్టీఆర్ ఓదార్చాడు. నేను ఎప్పటికీ ఎన్టీఆర్ కి రుణపడి వుంటానని శ్రీనివాస్ అన్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.