English | Telugu

వ‌ర్మ క‌రీంన‌గ‌ర్ లో ఏం చేయ‌బోతున్నాడు?

వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ప‌దేళ్ల త‌ర‌వాత రావ‌ల్సిన ఆలోచ‌న‌.. ఆయ‌న‌కు నిన్న సాయంత్ర‌మే వచ్చేస్తుంది. ప్ర‌తీదీ క్రియేటివిటీతో కూడిన క‌మ‌ర్షియాలిటీతో ఆలోచిస్తారాయ‌న‌. ఇప్పుడు ఆయన‌కు మ‌రో ఆలోచ‌న వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోనో, చెన్నైలోనో ఇండ్ర‌స్ట్రీ ఉండాలా..?? క‌రీంన‌గ‌ర్‌లో ఉండ‌కూడ‌దా?? అని. అందుకే ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో ఓ ఇండ్ర‌స్ట్రీ పెట్టేస్తున్నారు. న‌వంబ‌రు 18న క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌న యూనివ‌ర్సీటిలో ఓ అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించ‌బోతున్నాడ‌ట‌. ఈ స‌ద‌స్సులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చ‌ని వ‌ర్మ చెబుతున్నాడు. ''ఇండ్ర‌స్ట్రీ హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనే ఉండిపోవాల‌నుకోవ‌డం మూర్ఖ‌త్వంతో కూడిన అవివేకం. ప్ర‌పంచం ఇప్పుడు గ్లోబ‌ల్ విలేజ్ అయిపోతోంది. ఎవ‌రైనా ఎక్క‌డైనా సినిమా తీసుకోవ‌చ్చు'' అని చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రి క‌రీంన‌గ‌ర్‌లో వ‌ర్మ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.