English | Telugu

పూరి కొడుకు 'ఆంధ్రాపోరి' గొడవేంటి?

ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కొద్ది రోజుల నుంచి ఖమ్మం జిల్లా పాల్వంచలో జరుగుతోంది. ఈ సంధర్బంగా సినిమా యూనిట్ మెంబర్లు అందరూ భద్రాచలం రోడ్‌లోని ఒక హోటల్లో బస చేశారు. అయితే ఒకరోజు అర్ధరాత్రివేళ పాల్వంచ ఎస్.ఐ. షణ్ముఖాచారి ఈ హోటల్‌కి వచ్చాడు. అక్కడ బస చేసిన సినిమా యూనిట్ సభ్యులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పూరి జగన్నాథ్ కొడుకుతో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దాంతో పోలీసు అధికారులు సదరు ఎస్.ఐ.ని జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ ఎస్.ఐ. షణ్ముఖాచారి లబోదిబో అంటున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.