English | Telugu

సీక్వెలా... అంత సీన్ ఉందా??

టెంప‌ర్ సీక్వెల్ తీస్తామంటూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది, అభిమానులూ సంబ‌రాలు చేసుకొంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ టెంప‌ర్‌లో సీక్వెల్ తీసేంత స‌త్తా ఉందా?? అస‌లు ఈ సినిమా సీక్వెల్ అంటే క‌నీసం పూరి జ‌గ‌న్నాథ్, ఎన్టీఆర్ లు అయినా ముందుకొస్తారా?? గ‌ణేష్ మ‌ళ్లీ అంత ధైర్యం చేస్తాడా అనేది అనుమానమే. టెంప‌ర్ క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీసేంత సీన్ క‌నిపించ‌డం లేదు. రెండో భాగం ఉంది.. అనే హింట్ ఎక్క‌డా వ‌ద‌ల్లేదు. అంటే... ఇది ఇప్పుడొచ్చిన ఆలోచ‌న మాత్ర‌మే. దానికి తోడు పూరి - ఎన్టీఆర్ ల కాంబినేష‌న్ కుద‌ర‌డానికి ఇంకా టైమ్ ప‌డుతుంది. ఎందుకంటే అటు పూరి - ఇటు ఎన్టీఆర్‌ల వేర్వేరుగా క‌మిట్‌మెంట్స్ చేసేసుకొన్నారు. ఇక గ‌ణేష్ ప‌రిస్థితి అంతా అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. ఈసినిమా హిట్ట‌యినా మ‌నోడికి మిగిలేది అంతంత‌మాత్ర‌మే. ఎందుకంటే పీవీపీ చేతిలో ఈ సినిమా భ‌విష్య‌త్తు ఉంది. ముందు వారికి సెటిల్ చేసి, మిగిలింది తాను తీసుకోవాలి. పైగా ఈమ‌ధ్య గ‌ణేష్‌.. కొన్ని సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశాడు. ''మెగా కాంపౌండ్ మ‌నిషి అని న‌న్ను ఎన్టీఆర్ - పూరిలు అపార్థం చేసుకొన్నారు. మా మ‌ధ్య క‌మ్యునికేష‌న్ కుద‌ర్లేదు. అందుకే ఈ సినిమా ఆపేద్దామ‌నుకొన్నా'' అన్నాడు. అంటే టెంప‌ర్ జ‌రుగుతున్న‌ప్పుడు లోలోప‌ల చిచ్చు ర‌గిలింద‌న్న‌మాట‌. అయితే సినిమా కోసం అంద‌రూ కామ్ అయిపోయి.. బండి లాగించేశారు. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్లంతా క‌ల‌సి సినిమా చేయ‌డం దాదాపు అసాధ్యం. పైగా సీక్వెల్ సినిమాలు తెలుగునాట అంత విజ‌యవంతం కాలేదు. ఇడియ‌ట్‌, పోకిరిల‌ను సీక్వెల్ చేస్తాన‌ని చెప్పిన పూరి ఆ మాట మ‌ర్చిపోయాడు. టెంపర్ కూడా అంతేన‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు కామెంట్లు విసురుకొంటున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.