English | Telugu

పుట్టబోయే పిల్లలపై లవ్ జిహాదీ కామెంట్స్  

హీరోయిన్ గా 2003లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కన్నడ భామ ప్రియమణి(Priyamani)ఆ తర్వాత పాన్ ఇండియా నటిగా,పలు భాషలకి చెందిన సినిమాల్లో నటించి తన సత్తా చాటింది.షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చెన్నైఎక్స్ ప్రెస్ లో చేసిన స్పెషల్ సాంగ్ తో అయితే ఇండియన్ సినీ పరిశ్రమ తనవైపు చూసేలా చేసుకుంది.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటుతు జవాన్, ఆర్టికల్ 370 ,మైదాన్ వంటి సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. .

రీసెంట్ గా ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా పెళ్లి అయినప్పటి నుంచి కొంత మంది నన్ను టార్చర్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు.నాకు పుట్టబోయే పిల్లలు గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి నా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో ఆనందిస్తారని, వాళ్ళతో సంతోషకరమైన క్షణాలని పంచుకోవాలనుకున్నాను.కానీ అప్పట్నుంచి నాపై అనవసరమైన ద్వేషం మొదలయ్యింది.లవ్ జిహాదీ ఆరోపణలు వచ్చాయి.పిల్లలు పుట్టాక వాళ్ళని ఐసిస్ లో జాయిన్ చేస్తారా అని మెసేజెస్ చేసారు.నేను మీడియాపర్సన్ ని కాబట్టి ఇలాంటి మాటల్ని పట్టించుకోను.కానీ నా భర్త గురించి ఏం తెలుసనీ అలా మాట్లాడతారో అర్ధం కాదు.ఇప్పటికి నా భర్తతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పది మెసేజెస్ లో తొమ్మిది కామెంట్స్ మా పెళ్లి లవ్ జిహాదీ అంటు కామెంట్స్ చేస్తారు.ఆ విషయంలో చాలా బాధపడుతున్నాని చెప్పుకొచ్చింది.

ప్రియమణి హస్బెండ్ పేరు ముస్తఫా రాజ్(Musthafa raj)2017లో ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.ప్రియమణి ప్రస్తుతం తమిళ్ లో విజయ్(VIjay)హీరోగా తెరకెక్కుతున్న'జన నాయగన్'(Jana nayagan)లో కీలక పాత్ర పోషిస్తుంది.ఇదే కాకుండా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.ఫిబ్రవరి 20 న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే మలయాళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.