English | Telugu

ఉగ్రవాద దాడి ఘటనపై ప్రకాష్ రాజ్ ట్వీట్..మా రక్తం మరిగిపోతుంది

సుదీర్ఘ కాలం నుంచి విలక్షణమైన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న బహుబాషా నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)మంగళవారం జమ్మూకాశ్మీర్ లోని పహల్ గామ్ లో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా టూరిస్టులని కాల్చిచంపిన విషయంపై 'ఎక్స్' వేదికగా స్పందించాడు.

ఒక సుదీర్ఘమైన నోట్ ని రాసుకొస్తు ఏప్రిల్ 22 వ తేదీ పర్వతాలు కూడా మోయలేనంత నిశ్శబ్డం ఆవహించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశం పహాల్గమ్ లో నెత్తురు చిందించిన రోజు. మనఇంటికి వచ్చిన అమాయకపు అతిధుల్ని దారుణంగా చంపారు. అమాయకులపైనే కాదు కాశ్మిర్ పై జరిగిన దాడి. దీంతో శతాబ్దాల సంప్రదాయానికి అవమానం జరగడంతో పాటు ప్రతి కాశ్మీరీ గుండె పగిలింది. ఈ దాడి గురించి మాట్లాడానికి మాటలు కూడా రావడం లేదు. మన విశ్వాసాన్ని దెబ్బ తీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణ చర్య. ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తుంది. గుర్తింపుని కాపాడుకోవడంతో పాటు చెయ్యని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. దాడిని మాత్రం క్షమించకూడదు. ముమ్మాటికీ ఇది భయంకరమైన చర్య, అంతకు మించి పిరికి చర్య , మా రక్తం మరిగిపోతుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.