English | Telugu

ఆర్ నారాయణ మూర్తిని వరించిన అదృష్టం

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి రీసెంట్ గా ప్రముఖ దివంగత డాన్స్ మాస్టర్, నటుడు, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతు ముక్కు రాజు మాస్టర్ ఎంతో మానవీయత, గొప్ప తనం నిండిన మనిషి. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే మహాభాగ్యాన్ని నాకు కల్పించిన అసోసియేషన్ సభ్యులందరికీ నా వందనాలు. అసోసియేషన్ ఇంత గొప్పగా అవ్వడానికి కారణం ముక్కురాజు మాస్టర్ నే. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో కూడా మాస్టర్ నంబర్ వన్. 24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులే. 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనుమాస్టర్ పని చేశారు. అందుకేఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగింది. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికినారాయణ మూర్తి ఇదే ప్రాంగణం నుంచి విన్నవించాడు.

తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలం డాన్స్ మాస్టర్ గా, నటుడుగాసత్తా చాటారు ముక్కురాజు. తెలుగు వారి ఎవర్ గ్రీన్ క్లాసిక్' మాయాబజార్' లోని మోహిని భస్మాసుర అనే డ్రామా సాంగ్ తో ఆయన డాన్సింగ్, యాక్టింగ్ కెరీర్ మొదలయ్యింది. ఆ విధంగా డాన్స్ మాస్టర్ గా రెండు వందల సినిమాలు, నటుడిగా వెయ్యి సినిమాల దాక చేసారు. దీన్ని బట్టి ఆయన సినీ జర్నీ ఎంత ఘనమైనదో చెప్పుకోవచ్చు. ఆర్ నారాయణ మూర్తి నటించిన సినిమాల్లో ఎక్కువగాకనిపించిన ముక్కు రాజు మాస్టర్ 83 ఏళ్ళ వయసులో చనిపోవడం జరిగింది.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.