English | Telugu

దోషుల్ని కఠినంగా శిక్షించాలి..ప్రకాష్ రాజ్ మళ్ళీ వచ్చేసాడు. 

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్(Prakash raj)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.కలియుగదైవంశ్రీ ఏడుకొండలవాడి దివ్యప్రసాదమైన తిరుపతి లడ్డు గత వైసిపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చినపుడు జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా పవన్ సనాతన దర్మం దీక్ష చేయడంతో పాటు,లడ్డు కల్తీ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పాడు.దీంతో పవన్ ని ఉద్దేశిస్తు ప్రకాష్ రాజ్ విమర్శలు చెయ్యడం,పవన్ కూడా అదే రీతిలో సమాధానం ఇవ్వడం జరిగింది.రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు,రాజకీయాలపై తన అభిప్రాయూలని పంచుకున్నాడు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారు.అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలని పట్టించుకోకుండా సమయం వృధా చేస్తున్నారు.నేను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు.తిరుపతి లడ్డు విషయం చాలా సున్నితమైన అంశం.భక్తుల మనోభావాలకి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.లడ్డు తయారిలో నిజంగానే కల్తీ జరిగితే దోషులని వెంటనే శిక్షించాలని చెప్పుకొచ్చాడు.

పవన్, ప్రకాష్ కలిసి పలు చిత్రాల్లో నటించారు.బద్రి మూవీ ఈ ఇద్దరి కాంబోకి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చింది,చివరిగా ఈ ఇద్దరు వకీల్ సాబ్ లో నటించగా పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)లో కూడా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.