English | Telugu

ఎంతగానో చింతిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ అధికార లేఖ విడుదల 


-పవన్ అధికార లేఖ విడుదల
-లేఖ లో ఏముంది
-చిరంజీవితో ఇప్పటికి గుర్తుండిపోతుంది


భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న లెజండ్రీ ప్రొడ్యూసర్లలో 'ఎ.వి.ఎం(AVM)సంస్థ అధినేత 'శరవణన్‌'(Saravanan)కూడా ఒకరు. హీరోతో పాటు 24 క్రాఫ్ట్స్ మొత్తం ఎ.వి.ఎం. సంస్థలో సినిమా చెయ్యాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 84 సంవత్సరాల వయసు గల శరవణన్‌ గారు వృద్దాప్య సమస్యలు తలెత్తడంతో ఈ రోజు చనిపోవడం జరిగింది. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ లెజండ్రీ శిఖరానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.

ఈ కోవలోనే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం హోదాలో ఒక అధికార లేఖ విడుదల చేసారు. సదరు లేఖలో 'శరవణన్ గారు చనిపోయారనే విషయం తెలిసి ఎంతో చింతించాను. ఎ.వి.ఎం సంస్థ సుదీర్ఘ ప్రస్థానం కలిగిన సంస్థగా ఎదగడానికి శరవణన్ గారు ఎంతో కృషి చేశారు. విభిన్న కథాంశాలు ఎంచుకొని కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు నిర్మించే సంస్థగా పేరు సంపాదించింది. చిరంజీవి గారితో నిర్మించిన పున్నమి నాగు తరాల అంతరం లేకుండా నేటికీ ఎంతో మందిని అలరిస్తుంది. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు,లీడర్, మెరుపు కలలు, శివాజీ చిత్రాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరడంతో పాటు ఆయన కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని సదరు లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

also read:రాజ్ విషయంలో సమంత కీలక నిర్ణయం

తమిళ,తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఎ.వి.ఎం నుంచి సుమారు 300 సినిమాల వరకు సిల్వర్ స్క్రీన్ పై మెరిసాయి. దాదాపుగా అందరి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఎ.వి.ఎం 1947 లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. చివరగా సదరు సంస్థ నుంచి వచ్చిన మూవీ 'ఈదువుమ్ కాదందు పోగుమ్. 2014 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజవ్వగా సినీ అభిమానుల మన్ననలు అందుకుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.