English | Telugu

పవన్ కళ్యాణ్ ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి!

ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కోటి పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. థియేటర్లు కూడా చాలా కాలం పాటు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చూసి, మిగతా స్టార్స్ నేర్చుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు మిగతా స్టార్స్ అందరికీ సినిమా తప్ప వేరే లోకం లేదు. అయినప్పటికీ వారి నుంచి ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు. కానీ, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం కాకముందు.. 2021లో 'వకీల్ సాబ్', 2022లో 'భీమ్లా నాయక్', 2023లో 'బ్రో'.. ఇలా ఏడాదికి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. 2024లో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక ఆయన చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

'హరి హర వీరమల్లు' ఆగిపోయింది అన్నారు, 'ఓజీ' ఆలస్యమన్నారు, 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు ఉండకపోవచ్చు అన్నారు. కట్ చేస్తే.. కేవలం కొద్ది నెలల గ్యాప్ లోనే.. ఈ మూడు సినిమాల పెండింగ్ షూట్ ని పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్. మొదట 'హరి హర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ చేశారు. అది జూలై 24న విడుదలైంది. అదే స్పీడ్ లో 'ఓజీ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తాజాగా ఆయన.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ కూడా కంప్లీట్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశముంది.

పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. షూట్ బ్యాలెన్స్ ఉన్న తన మూడు సినిమాలను వేగంగా పూర్తి చేశారు. అలాంటిది సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్న స్టార్స్.. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.