English | Telugu

నివేదా పేతురాజ్ పెళ్లి.. వరుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

ప్రముఖ నటి నివేదా పేతురాజ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. రాజ్ హిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా రాజ్ హిత్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు నివేదా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవల నివేదా, రాజ్ హిత్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని సమాచారం. (Nivetha Pethuraj Wedding)

తమిళనాడుకి చెందిన నివేదా.. తమిళ్ తో పాటు, తెలుగులోనూ నటిగా మంచి గుర్తింపు పొందారు. 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, దాస్‌ కా ధమ్కీ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. చివరిసారి 2023లో విడుదలైన 'బూ' అనే ద్విభాషా చిత్రంలో కనిపించిన నివేదా.. ప్రస్తుతం 'పార్టీ' అనే తమిళ సినిమా చేస్తున్నారు.

ఇక నివేదా పెళ్లి చేసుకోబోతున్న రాజ్ హిత్ ఇబ్రాన్ విషయానికొస్తే.. ఆయనది కూడా తమిళనాడే అయినప్పటికీ, దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ హిత్ రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. ఆ విషయం ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని గమనిస్తే అర్థమవుతుంది. మోడలింగ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రాజ్ హిత్.. వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ బాగానే ఉంటుందని, ముఖ్యంగా పలు ఖరీదైన కార్లు తన గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం.

మరో విషయం ఏంటంటే.. సినిమాల్లోకి రాకముందు నివేదా దాదాపు పదేళ్ళపాటు దుబాయ్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. పైగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరికీ కూడా రేసింగ్ అంటే ఇష్టం. ఒకే చోట ఉండటం, ఇద్దరి ఇష్టాలు కలవడం.. వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నివేదా.. పెళ్లి తర్వాత పూర్తిగా దుబాయ్ లో సెటిల్ అయ్యి సినిమాలకు దూరమవుతారో లేక అభిమానుల కోసం యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తారో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.