English | Telugu

నిత్యా మీన‌న్.. డైరెక్ట్ ఓటీటీ

నిత్యా మీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా సౌత్ సినీ ప్రేక్ష‌కుల‌కు చెప్పన‌క్క‌ర్లేదు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పించ‌టానికి ఆమె ఎప్పుడూ మొగ్గు చూపుతుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌చ్చిన ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే ఓటీటీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌టానికి రెడీ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే, ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘కుమారి శ్రీమతి’. దీనికి గోమ‌టేశ్ ఉపాధ్యే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుద‌ల చేయ‌బోతున్నారు. దానికి సంబంధించిన డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. అది కూడా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని మేక‌ర్స్ విడుద‌ల చేయ‌బోతున్నారు.

కుమారి శ్రీమ‌తి చిత్రంలో నిత్యామీన‌న్.. దేనికీ భ‌య‌ప‌డ‌ని అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. అలా మొద‌లైంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ అమ్మ‌డు తెలుగులో భీమ్లా నాయ‌క్‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ఆమె తెలుగు సినిమా రిలీజ్ కాలేదు. తెలుగులో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తోన్న వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా మూవీస్ బ్యాన‌ర్స్ కుమారి శ్రీమ‌తి సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.

నిత్యామీన‌న్ న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. అది కూడా తెలుగులో నిర్మించిన స్కైలాబ్ చిత్రంతో. చాలా వ‌ర‌కు సినిమాలు నేరుగా రిలీజ్ కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నిత్యామీన‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన కుమారి శ్రీమ‌తి మూవీ కూడా నేరుగా ఓటీటీలోకి రిలీజైంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.