English | Telugu

సిద్ధార్థ్‌, అదితి రావు రిలేషన్‌కి అజయ్‌ భూపతే కారణమా?

సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి రిలేషన్‌ ఉన్న విషయం తెలిసిందే. అడపా దడపా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. తమ మధ్య ఏదో వుంది అని చెప్పేందుకు వీరిద్దరూ తెగ తంటాలు పడుతున్నారు. అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘మహా సముద్రం’ సెట్స్‌లోనే వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో వెంటనే రిలేషన్‌లోకి వెళ్ళిపోయారట. వీరిద్దరి రిలేషన్‌పై అజయ్‌ భూపతి చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్‌, అదితి కలిసి తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ అజయ్‌ భూపతి తన ట్వీట్‌లో ఏమన్నాడంటే.. ‘దీనికి నేనే కారణం నేనే అని అందరూ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ప్రశ్నించాడు. వీరిద్దరితోనూ సినిమా చేసిన డైరెక్టరే ఈ ప్రశ్న అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే షూటింగ్‌ జరుగుతున్నంత కాలం అతని ఎదురుగానే వారు ఉంటారు. ఈ విషయం తెలియకుండా ఉంటుందా అనేది నెటిజన్ల ప్రశ్న. అజయ్‌ ఈ ప్రశ్న వేయడం వెనుక సిద్ధార్థ్‌, అదితి మధ్య విషయం ఉందని ఇప్పుడు అందరూ ఫిక్స్‌ అయ్యారు. 2021లో వచ్చిన ‘మహాసముద్రం’ డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్‌, అదితికి ఇది సూపర్‌హిట్‌ మూవీనే. ఎందుకంటే వీరి రిలేషన్‌కి పునాది వేసింది ఆ సినిమానే కాబట్టి వారికది మెమరబుల్‌ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.