English | Telugu

నిఖిల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..డాడీ గా ప్రమోషన్ పొందిన నిఖిల్ 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయమయిన నటుడు నిఖిల్. కొన్ని పరాజయాల తర్వాత కార్తికేయ 2 అనే సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ హీరో స్థాయికి నిఖిల్ ఎదిగాడు. ప్రస్తుతం నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య పల్లవి వర్మ ప్రస్తుతం గర్భవతి. డాక్టర్ గా పనిచేస్తున్న పల్లవి వర్మ ఇటీవలే చెకప్ చేయించుకోగా తల్లి కాబోతుందని తెలిసింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి తెలియచేసాడు. దీంతో తమ అభిమాన హీరో తండ్రి కాబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు సోషల్ మీడియా ద్వారా నిఖిల్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.

నిఖిల్ తాజాగా స్వయం భూ అనే ఒక పీరియాడిక్ మూవీని చేస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లోనే హై బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీలోని తన క్యారక్టర్ కోసం నిఖిల్ ప్రస్తుతం కత్తి విన్యాసాలు,గుర్రపు స్వారీలు నేర్చుకుంటున్నాడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ మూవీ మీద నిఖిల్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.