English | Telugu

'మంగళవారం'.. సగమే చూశారు.. సీక్వెల్ లో అసలు బొమ్మ చూస్తారు!

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్, అజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో పాయల్ బోల్డ్ పాత్ర పోషించడంతో మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. 'మంగళవారం' నేడు(నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండటం విశేషం.

మొదటి షో నుంచే 'మంగళవారం' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కాకపోయినా.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, మాస్‌ ఆడియన్స్‌ మెచ్చేలా ఉంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్ అదిరిపోయింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలలో వచ్చే ట్విస్ట్ లు వావ్ అనేలా ఉన్నాయి. ఇక సినిమా ఎండింగ్ లో ‘టు బి కంటిన్యూడ్‌’ అని వేసి, సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు చెప్పేశాడు. 'మంగళవారం'లో శృంగార కోరికలను అదుపు చేసుకోలేని బోల్డ్ పాత్రలో పాయల్ కనిపించింది. చివరిలో ఆమె పాత్రపై సింపతీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. మొదటి భాగంలోనే ఇలా ఉంటే, రెండో భాగంలో ఇంకెంత బోల్డ్ ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.