English | Telugu

36 ఏళ్ల త‌ర్వాత.. ఆ కొర‌త కూడా తీరింది!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ నెక్ట్స్ సినిమాను మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌నుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోలంద‌రితోనూ న‌య‌న‌తార క‌లిసి న‌టించింది. అయితే క‌మ‌ల్ హాస‌న్‌తో మాత్రం ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌లేదు. ఆ కోరిక కూడా ఇప్పుడు తీరిపోనుంది. ముందుగా ఈ సినిమాలో త్రిష‌ను హీరోయిన్‌గా అనుకున్న‌ప్ప‌టికీ ఇప్పుడామె స్థానంలో న‌య‌న‌తార న‌టించ‌నుండ‌టం కొస మెరుపు.

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నాయ‌గ‌న్ సినిమా (తెలుగులో నాయకుడు) 1987లో విడుద‌లైంది. త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌లేదు. 36 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వీరు సినిమా చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 234వ సినిమా ఇది. నాయ‌గ‌న్‌కు ఇళ‌య‌రాజా సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విక్ర‌మ్ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు క‌మ‌ల్, మ‌ణిర‌త్నం కాంబో మూవీ రూపొంద‌నుంది. మ‌రో వైపు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కత్వంలోనూ క‌మ‌ల్ హాస‌న్ సినిమా చేస్తున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఇండియ‌న్ 2 మూవీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. పాతికేళ్ల ముందు వ‌చ్చిన ఇండియ‌న్ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .