English | Telugu

ఓజీ పైనే ఆశలన్నీ.. మెగా కమ్ బ్యాక్ అవుతుందా..? 

మెగా హీరోల ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో రికార్డులు ఉన్నాయి. అలాంటి మెగా ఫ్యామిలీ గత రెండేళ్లలో వరుసగా ఎనిమిది పరాజయాలను చూసింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ'పైనే వారు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. (They Call Him OG)

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అయితే గత రెండేళ్లలో వీరి నుంచి ఎనిమిది సినిమాలు రాగా.. అన్నీ పరాజయం పాలయ్యాయి. 'బ్రో' సినిమా నుంచి ఈ ఫ్లాప్ ల పరంపర మొదలైంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' మూవీ 2023 జూలైలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. అదే ఏడాది ఆగష్టులో చిరంజీవి 'భోళాశంకర్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున', నవంబర్ లో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' విడుదల కాగా.. మూడూ పరాజయం పాలయ్యాయి. 2024 లో వరుణ్ తేజ్ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మార్చిలో 'ఆపరేషన్ వాలెంటైన్', నవంబర్ లో 'మట్కా' రిలీజ్ కాగా.. రెండూ డిజాస్టర్ అయ్యాయి. ఇక 2025 ను కూడా ఫ్లాప్ తోనే ప్రారంభించింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలై ఘోర పరాజయాన్ని చూసింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం 'హరి హర వీరమల్లు' సైతం జూలై 24న ప్రేక్షకుల ముందు నిలిచి, మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో ఫ్లాప్ ని చేర్చింది.

ఇలా 2023 జూలై నుంచి ఈ రెండేళ్లలో మెగా ఫ్యామిలీ ఏకంగా ఎనిమిది ఫ్లాప్ లు చూసింది. ఈ ఫ్లాప్ ల నుంచి మెగా ఫ్యామిలీని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చే సినిమా 'ఓజీ' అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అభిమానుల్లో మాత్రమే కాకూండా, ప్రేక్షకుల్లో కూడా 'ఓజీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ పరంగా ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ తర్వాత వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరి ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న విజయం వస్తుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.