English | Telugu

కూతురిని చంపేస్తావా.. రాజ్ తరుణ్ నిన్ను వదిలిపెట్టను!

కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్, లావణ్య వివాదం సంచలనమైన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్యనే తనను ఇబ్బంది పెడుతుందని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని రాజ్ తరుణ్ అన్నాడు. వీరి గొడవ చాలారోజుల పాటు సాగింది. మీడియా, సోషల్ మీడియాలో ఈ టాపిక్ మారుమోగిపోయింది. అయితే కొద్దిరోజులుగా వీరి వివాదం గురించి పెద్దగా వార్తలు లేవు. అలాంటిది ఇప్పుడు సడెన్ గా మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది.

రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి ఇబ్బంది పెడుతున్నాడని తాజాగా లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తో కలిసి కొన్నేళ్ల క్రితం కోకాపేట్ లో విల్లాను కొనుగోలు చేశానని, 2024 లో రాజ్ తరుణ్ ఆ విల్లాను ఖాళీ చేశాడని తెలిపింది. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి అక్కడ ఉంటున్నాని, అయితే తాము లేని సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు వచ్చి ఇంటిని ఖాళీ చేసి, పెంపుడు జంతువులని చేశారని చెప్పింది.

"కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంట్లో సమయంలో వచ్చి.. ఇంట్లోని వస్తువులన్నీ తీసుకెళ్లారు. లీగల్ గా చూసుకుంటానన్న రాజ్ తరుణ్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్?. పెంపుడు కుక్కలను కూడా చంపేశారు. కూతురు కూతురు అన్నాడు.. హ్యాపీ తల్లి(కుక్క పిల్ల)ని చంపేశాడు. ఇలాంటి వాళ్ళని చట్టం వదలకూడదు. వాళ్ళకి శిక్ష పడే వరకు నా పోరాటం ఆగదు. రాజ్ తరుణ్ నువ్వు తప్పించుకోలేవు." అని లావణ్య చెప్పుకొచ్చింది. తాజా ఘటనతో లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.