English | Telugu

ఓజి లోని క్యారక్టర్ పై శ్రియా రెడ్డి వ్యాఖ్యలు ఇవేనా!..  

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రీవియస్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో, అభిమానుల ఆశలన్నీ 'ఓజి'(og)పైనే ఉన్నాయి. ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల సిద్ధమవుతుండగా, 'ఓజి' తో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ తన స్టామినాని మరోసారి చాటి చెప్తాడనే నమ్మకం కూడా వాళ్ళల్లో ఉంది. ప్రచార చిత్రాలతో పాటు, ఇప్పటి వరకు రిలీజైన సాంగ్స్ కూడా 'ఓజి 'పై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి.

ఓ జి లో పవన్ సరసన 'ప్రియాంక మోహన్'(Priyanka MOhan)జత కడుతుండగా, వర్సటైల్ నటి ''శ్రియా రెడ్డి'(Sriya Reddy)కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఆమె రోల్ గురించి మేకర్స్ ఇంకా బయటకి చెప్పలేదు. కానీ రీసెంట్ గా 'శ్రియా రెడ్డి ఓజి లోని తన క్యారక్టర్ గురించి మాట్లాడుతు 'ఓజీ’లో నా క్యారక్టర్ రియలిస్టిక్‌ కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారక్టర్ కూడాను తద్వారా మరో సారి విభిన్నమైన నటనని ప్రదర్శించే అవకాశం వచ్చింది. హై యాక్షన్‌తో పాటు మంచి మెలోడి డ్రామా కూడా ఉండటంతో, ఖచ్చితంగా ఓజి ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుందని శ్రీయ రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రభాస్ ప్రీవియస్ మూవీ 'సలార్' లో 'రాధా రమ' క్యారక్టర్ ద్వారా 'శ్రియా రెడ్డి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఓజి లో 'జ్యోతి గంభీర' అనే క్యారక్టర్ లో కనిపిస్తుంది. పవన్ 'ఓజాస్ గంభీర' గా కనిపిస్తున్నాడు

దీంతో 'శ్రియా రెడ్డి చెప్పిన మాటల ద్వారా 'ఓజి' లోని ఆమె క్యారక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ లో అయినా, 'శ్రియా రెడ్డి తన నట విశ్వరూపాన్ని ప్రదరిస్తుంది. పొగరు, కాంచీవరం, సమ్ టైమ్స్ వంటి చిత్రాల్లోని నటనే అందుకు ఉదాహరణ. ఇక 'ఓజి' రిలీజ్ కి ముందే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది. ఓవర్ సీస్ లో ఇప్పటికే పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సాధించిన మూవీగా నిలిచింది. ఇటీవల ఒక అభిమాని ఐదు లక్షల రూపాయలకి ఓజి టికెట్ కొనడం కూడా జరిగింది.దీన్ని బట్టి 'ఓజి' క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. డివివి దానయ్య(Dvv Danayya)దాసరి కళ్యాణ్(Dasari Kalyan)తమ గత చిత్రాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా, భారీ వ్యయంతో నిర్మించారు. సుజిత్(Sujeeth)దర్శకుడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.