English | Telugu

శంకర్ బ్రాండ్ కి 30కోట్లు..!

సంచలనాలకు కేరాఫ్ అయిన తమిళ దర్శకుడు 'శంకర్' ప్రస్తుతం విక్రమ్ తో కలిసి 'ఐ' అనే భారీ బడ్జెట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు హక్కులకు భారీ మొత్తం ఆశీ౦చడంతో తీసుకోవడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడంలేదని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా తెలుగు హక్కులు కావాలంటే ముప్పయ్‌ కోట్లు చెల్లించాల్సిందేనని లేకపోతే తానే విడుదల చేసుకుంటానని ఆస్కార్‌ రవిచంద్రన్‌ డిసైడ్ కూడా అయ్యారు. అయితే తాజాగా 'ఐ' మనోహరుడు’ హక్కులకి ముప్పయ్‌ కోట్లు ఇవ్వడానికి మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో విక్రమ్ కి తెలుగులో అంత మార్కెట్ లేకపోయినా, ఈ సినిమాకి ముప్పయ్‌ కోట్లు చెల్లించారంటే కారణం కేవలం శంకర్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇక సెప్టెంబర్ 15న ‘ఐ’ ఆడియో, అక్టోబర్ 22న సినిమా రిలీజ్ కాబోతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.