English | Telugu

హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్!

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ ల గురించి ప్రముఖ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన విషయం కరెక్టే కానీ, మాట్లాడిన విధానం తప్పని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన కామెంట్స్ ని పూర్తిగా ఖండిస్తున్నారు.

చిన్మయి, అనసూయ వంటి వారు ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎవరెలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత విషయమని, ఫలానా డ్రెస్ వేసుకోవాలని చెప్పే రైట్ ఎవరికీ లేదని అన్నారు. అంతేకాదు, మహిళలకు చీర కట్టుకోమని చెబుతున్న ఆయన.. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ పంచె కట్టుకున్నాడా? అని ప్రశ్నించారు.

Also Read: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

ఇక తాజాగా శివాజీ కామెంట్స్ ని మంచు మనోజ్ కూడా ఖండించాడు. "ఈ రకమైన కామెంట్స్ తీవ్ర నిరాశను కలిగిస్తాయి. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం సరైనది కాదు. గౌరవం అనేది వ్యక్తిగత ప్రవర్తనతో రావాలి.. మహిళల దుస్తుల గురించి మాట్లాడి, వారిని అవమానించడం ద్వారా కాదు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను." అని మనోజ్ రాసుకొచ్చాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.