English | Telugu

"బిజినెస్ మ్యాన్ -2" చేయాలనుంది - ప్రిన్స్

"బిజినెస్ మ్యాన్ -2" చేయాలనుంది ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మించిన చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలైన తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. పదహారు వందల ప్రింట్లతో, రెండువేల స్క్రీన్లలో ప్రదర్శించబడిన ఈ చిత్రం 81 సంవత్సరాల తెలుగు బాక్సాఫీస్ రికార్డుల్ని సైతం ఈ చిత్రం తిరగరాసింది.

అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా "బిజినెస్ మ్యాన్ -2" అన్న చిత్రాన్ని ఎవరైనా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తే అందులో కూడా తానే హీరోగా నటించాలనుందని హీరో మహేష్ బాబు మీడియాకిచ్చిన ఇంటర్ వ్యూలో అన్నారు. ఆయన తాను రికార్డుల కోసం ఏనాడూ ఆలోచించలేదనీ, తన పని తాను చేసుకుపోతుండటమేననీ కూడా అన్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.