English | Telugu

వెంకీ సరసన అంజలి

వెంకీ సరసన అంజలి హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెకటేష్ , ప్రిన్స్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తూండగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ చిత్రంలో హీరో వెంకటేష్ సరసన హీరోయిన్ గా అంజలి నటించనుంది.

ఈ అంజలి తమిళంలో వచ్చిన "ఎంగేయం ఎప్పోదుం" (తెలుగులో "జర్నీ") చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. మహేష్ బాబు, సమంత కలసి నటించిన "దూకుడు" సూపర్ డూపర్ హిట్టయిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. మరి ఈ "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" ఇంకెంత పెద్ద హిట్టవుతుందో వేచి చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.