English | Telugu

గుంటూరు కారం ఘాటు ఎక్కువేనంట.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ కి సంబందించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వార్తని విన్న మహేష్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఎప్పుడెప్పుడు జనవరి 12 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అంతలా ఆనందపడటానికి కారణం ఏంటంటే గుంటూరు కారం మూవీ సూపర్ గా ఉండబోతుందనే వార్త బయటకి వచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న తాజా మూవీ గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ బయటకి వచ్చినప్పటి నుంచి సినిమా మీద మహేష్ అభిమానులు అలాగే సినీ అభిమానులు విపరీతమైన అంచనాలని పెట్టుకున్నారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు,అలాగే అల వైకుంటపురం మూవీ తో దర్శక మాంత్రికుడుగా కూడా పేరు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ అధిరిపోయిందని అలాగే అతడు మూవీ తర్వాత మళ్ళి ఆ స్థాయిలో త్రివిక్రమ్ గుంటూరు కారం లో కామెడీని పండించాడని అంటున్నారు. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త తో మహేష్ అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.

త్రివిక్రమ్ సినిమా లోని మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. గోల గోల గా లేకుండా స్మూత్ గా ఉంటూ సినిమా ఘన విజయంలో తన పాత్రని తాను పోషిస్తాయి. అందుకు ఉదాహరణగా మహేష్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన అతడు మూవీనే ఒక ఉదాహరణ. ఏదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేమో అని ప్రేక్షకుడు ఆయా క్యారక్టర్ మాట్లాడుతుంటే జాగ్రతగా వింటూ ఉంటాడు. తీరా క్యారక్టర్ డైలాగ్ చెప్పడం అయిపోయాక అర్ధం అవుతుంది ఆ కారక్టర్ చెప్పింది కామెడీ డైలాగ్ అని. అంతలా త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులని రంజింప చేస్తాయి. ఇక ఆయన సినిమాల క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా వెరైటీ గా ఉంటాయి.అందుకు మహేష్,త్రివిక్రమ్ ల కలయిక లో వచ్చిన అతడు,ఖలేజ సినిమాలే ఒక ఉదాహరణ. సో.. గుంటూరు కారం క్లైమాక్స్ అండ్ సినిమా లో ఉన్న కామెడీ సూపర్ గా ఉందనే వార్తలతో గుంటూరు కారం మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.