English | Telugu

మ‌హేష్‌.. ప్ర‌భాస్‌ని దాటేశాడు...!

బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ రూ.24 కోట్ల పారితోషికం తీసుకొన్నాడ‌న్న వార్త సంచ‌ల‌నం సృష్టించింది. టాలీవుడ్‌లో ఓ హీరో అందుకొన్న అత్య‌ధిక పారితోషికం అంది. దాదాపుగా రెండేళ్లు ఆ సినిమా కోసం శారీర‌కంగా, మాన‌సికంగా శ్ర‌మ‌ప‌డ్డాడు ప్ర‌భాస్. అందుకే రూ.24 కోట్లు ఇవ్వ‌డంలో త‌ప్పులేద‌నిపించింది. అయితే... మ‌హేష్ బాబు ఆ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. అంత‌కంటే ఒక కోటి ఎక్కువ‌గానే అంటే.. రూ.25 కోట్లు తీసుకొన్నాడు.కానీ.. రెండేళ్లు క‌ష్ట‌ప‌డ‌లేదు, త‌న బాడీనీ క‌ష్ట‌పెట్ట‌నివ్వ‌లేదు. ఇదంతా శ్రీ‌మంతుడు మ‌హేష్ బాబు మ్యాజిక్‌.

శ్రీ‌మంతుడు సినిమాకి మ‌హేష్‌కి అక్ష‌రాలా రూ.25 కోట్లు దక్కింద‌ని టాలీవుడ్ టాక్‌. శ్రీ‌మంతుడు సినిమాకి మ‌హేష్ ఓ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పారితోషికంతో పాటు, సినిమాలో వాటా కూడా అందుకున్నాడు. అవి రెండూ క‌ల‌పి అక్ష‌రాలా రూ.25 కోట్ల‌ని టాక్‌.

శ్రీ‌మంతుడు సినిమాకి రూ.80 కోట్ల బిజినెస్ జ‌రిగింది. లాభాల్లో వాటా ద‌క్కించుకొన్న మ‌హేష్‌కి బాగా గిట్టుబాటైంది. అటు పారితోషికం, ఇటు వాటా... రెండు విధాలా ప‌నైంది. మ‌హేష్ కూడా ఇది వ‌ర‌కెప్పుడూ తీసుకోనంత పారితోషికం శ్రీ‌మంతుడుకు తీసుకొన్నా అని కూడా చెబుతున్నాడు. దూకుడు త‌ర‌వాత మ‌హేష్ పారితోషికం రూ.18 కోట్ల‌కు చేరింది. ఇప్పుడు దాన్నీ దాటేశాడు. ఇక‌మీద‌ట మ‌హేష్ తో సినిమా అంటే.. రూ.25 కోట్లు చ‌దివించుకోవాల్సిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.