English | Telugu

'ఆదిపురుష్' కోసం ఏకంగా షోనే బుక్ చేసిన కృతి సనన్!

'ఆదిపురుష్' సినిమా విడుదలకు ముందు పలువురు ప్రముఖులు ఉచిత టికెట్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదల తర్వాత కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ చిత్రంలో జానకి పాత్రలో నటించిన హీరోయిన్ కృతి సనన్ తాజాగా 'ఆదిపురుష్' ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ షో మొత్తాన్ని బుక్ చేశారు.

కృతి సనన్ కి తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఎంతో అభిమానం. తన మూవీ ప్రమోషన్స్ ఆ స్కూల్ లో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ కి 'ఆదిపురుష్' సినిమా చూపించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ లో పూర్తిగా ఒక షోనే బుక్ చేశారు. అంతేకాదు స్టూడెంట్స్ తో తాను కూడా మరోసారి ఆదిపురుష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను చదువుకున్న స్కూల్ లోని స్టూడెంట్స్ కి ఉచితంగా సినిమా చూపించాలనే కృతి సనన్ ఆలోచన పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.

రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్'లో ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు. టి. సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదలైంది. ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.410 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.