English | Telugu
సంక్రాంతికి పాన్ ఇండియా సినిమా 'జాతర'
Updated : Jun 18, 2023
ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తెలుగు చిత్రసీమప్రేక్షకులకూ సుపరిచితులే. ఆయన పెద్దకుమారుడు, కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై గోవర్థన్రెడ్డి నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'జాతర'. ఈ సినిమాకు ఉదయ్ నందనవనమ్ దర్శకుడు.
ఆగస్టులో'జాతర' సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు నిఖిల్ కథానాయకుడిగా 'శంకరాభరణం' తీసిన ఉదయ్ నందనవనమ్.. ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు. అందమైన ప్రేమకథతో రగ్గడ్ ఫిల్మ్ తీయనున్నారు. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
చిత్ర నిర్మాత గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఆగస్టులోచిత్రీకరణ ప్రారంభించి, ఈ 'జాతర'నుసంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం. మంచి కథ కుదిరింది. దీనికి ప్రజ్వల్ దేవరాజ్ గారు అయితే కరెక్ట్ అని ఆయన్నుసంప్రదించాం. వెంటనే ఓకే చేశారు. దేవరాజ్ గారు కూడా మాకుఅండగా ఉన్నారు. బి. వాసుదేవ్ రెడ్డి రాసిన కథకు ఉదయ్ నందనవనమ్ఇచ్చిన ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే 'జాతర' స్క్రిప్ట్ను మరింత కొత్తగా మార్చింది. బళ్ళారి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం'' అని చెప్పారు.
దర్శకుడు ఉదయ్ నందనవనమ్ మాట్లాడుతూ.. ''సినిమాలోప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో.. నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలాకథ, కథనం ఉంటాయి. త్వరలో కథానాయిక వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.