English | Telugu

జితేందర్‌రెడ్డి.. నాని దర్శకుడు పెద్దగానే ప్లాన్ చేశాడు!

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' వంటి రొమాంటిక్‌ లవ్‌స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు విరించి వర్మ, కాస్త రూట్‌ మార్చి డిఫరెంట్‌ జానర్‌ కథతో 'జితేందర్‌ రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. "హిస్టరీ(హిజ్‌ స్టోరీ) నీడ్స్‌ టు బీ టోల్డ్‌" అనేది ట్యాగ్‌లైన్‌. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు పోస్టర్‌లో చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది చూపించలేదు.. పాత్రధారి పేరు కూడా వెల్లడించలేదు. అయితే పోస్టర్‌ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

సినిమా టైటిల్‌ను బట్టి, పోస్టర్‌లో ఉన్న నేపథ్యాన్ని నిశితంగా గమనిస్తే... తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌ చూస్తుంటే.. ప్రేమకథలతో ఫేమస్‌ అయిన విరించి వర్మ ఈ తరహా కథ ఎందుకు ఎంచుకున్నారు? ఈ చిత్రంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న క్యూరియాసిటీ కలుగుతోంది.

ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.