English | Telugu

హీరోయిన్ ప్రాణాలు తీసిన సర్జరీ!

సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం అందంగా కనపడటం కోసం ఎంతగానో తాపత్రయపడుతుంటారు. తమ అందానికి మెరుగు దిద్దుకోవడానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలలో సర్జరీ కూడా వచ్చి చేరింది. లేటెస్టుగా అందం కోసం సర్జరీ చేయించుకొని అది వికటించడం తో ఒక నటి చనిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురి చేసింది.

హాలీవుడ్ సినీ పరిశ్రమకి జాక్వెలిన్ కరేరి అనే నటి సుపరచిస్తురాలే. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అర్జెంటినా కి చెందిన జాక్వెలిన్ మాజి బ్యూటీ క్వీన్ గా కూడా గెలుపొందింది. ఆమె ఇటీవల తన అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. అదే ఆమె ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. సర్జరీ చేశయించుకున్న కొన్ని రోజులకి శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో జాక్వెలిన్ చనిపోయింది.

ఈ సంఘటన తో ఒక్క సారిగా అర్జెంటీనా సినీ పరిశ్రమ తో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా సర్జరీ చేయించుకొని చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి బరువు తగ్గడం కోసమని దాసరి నారాయణ రావు ,ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చనిపోయారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.