English | Telugu

వరుణ్ లాంటి మొగుడు కావాలంట...!

గోవా బ్యూటీ ఇలియానా మొన్నటివరకు షాహీద్ కపూర్ తో సీక్రెట్ రోమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు గతకొంత కాలంగా కాబోయే వరుడు కోసం ఎదురుచూస్తున్నదని వార్తలు కూడా వస్తున్నాయి. తనకు కాబోయే భర్త "మంచి లక్షణాలు ఉండాలి. అందగాడు, నన్ను బాగా చూసుకోవాలి" అంటూ పెద్ద లిస్టు చెప్పే ఇలియానా ఈసారి ఏకంగా నాకు ఈయనే కావాలని ధైర్యంగా చెప్పేసింది.

ఈ అమ్మడికి బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ భర్తగా కావాలని కోరుకుంటుంది. వీరిద్దరూ కలిసి "మై తేరా హీరో" అనే సినిమాలో నటించారు. ఇందులో చాలా హాట్ హాట్ లిప్ లాక్ సీన్ ఒకటి(సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో తెలియదు)ఉంది. దీని గురించి ఇలియానా మాట్లాడుతూ... నేనిప్పటివరకూ రణబీర్ కపూర్, షాహీద్ కపూర్ లతో సినిమాలు చేశాను కానీ, వాళ్ళిద్దరితో కన్నా నాకు వరుణ్ తో మంచి అనుబంధం కుదిరింది. వరుణ్ బాగుంటాడు. మంచి పరిణితి గల వ్యక్తి. అనవసరంగా మాటలు మాట్లాడడు. టోటల్ గా చెప్పాలంటే తను "కంప్లీట్ మెన్". అందుకే నాకు వరుణ్ లాంటి భర్త కావాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చాలా రోమాన్స్ జరిగిందని వార్తలు వినిపించాయి. మరి ఇపుడు ఇలియానా మాటలు వింటుంటే వీరి మధ్య రోమాన్స్ చాలా దూరమే వెళ్లిందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలియానా ఆశలపై వరుణ్ ఒక్కసారిగా నీళ్ళు చల్లినంత పనిచేసాడు. వరుణ్ మాత్రం "పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు. కానీ కచ్చితంగా సినిమా హీరోయిన్ ను మాత్రం పెళ్ళాడను" అని చెప్పేసాడు. దాంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని తెలిసింది. చూద్దాం.. ఇలియానా రోమాన్స్ ఇంకెంత వరకు వెళుతుందో.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.