English | Telugu

హ్యాపీ బర్త్ డే 'సాయికిరణ్ అడివి'

'వినాయకుడు' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ అడివి తన జన్మదినోత్సవాన్ని ఆగస్ట్ 11న జరుపుకుంటున్నారు. తన తొలి సినిమా 'వినాయకుడు'తోనే మంచి అభిరుచి గల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత విలేజ్ లో వినాయకుడు సినిమా తీసి వరుస విజయాలను దక్కించుకున్నాడు. మొదటి రెండు సినిమాలకు రెండు నంది అవార్డులను గెలుచుకున్న ఈ టాలెంటేడ్ డైరెక్టర్...ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌-లక్ష్మణ్ లు నిర్మిస్తోన్న 'కేరింత' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌లో సినిమాను కంప్లీట్‌ చేసి అక్టోబర్‌లో కేరింత ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయికిరణ్ అడివి కేరింతతో అందరి అంచనాలు అందుకుని మంచి సూపర్ హిట్ అందిస్తాడని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పేద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.