English | Telugu

'గోవిందుడి...' ఆడియో ముహూర్తం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో రిలీజ్ ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 15‌న ఈ వేడుకను గ్రాండ్ గా చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్లు సమాచారం. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా అద్భుతంగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.