English | Telugu

'ఘాటి' షాకింగ్ బిజినెస్.. అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు!

ఈ జనరేషన్ లో హీరోలకు సమానమైన క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో అనుష్క శెట్టి (Anushka Shetty) ఒకరు. అలాంటి అనుష్క కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించారు. 'బాహుబలి' తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లోనే నటించారు. గత ఎనిమిదేళ్లలో అనుష్క నుంచి 'భాగమతి', 'నిశ్శబ్దం', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. వాటిలో 'నిశ్శబ్దం' నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. దీంతో అనుష్క కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (Ghaati Movie Business)

సెప్టెంబర్ 5న 'ఘాటి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు అనుష్క. క్రిష్ దర్శకుడు కావడంతో పాటు, 'భాగమతి' తర్వాత అనుష్క నుంచి వస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావడంతో.. 'ఘాటి'పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.7 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు, సీడెడ్ రూ.4 కోట్లు చొప్పున.. తెలుగు స్టేట్స్ లో రూ.21 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముంది అంటున్నారు. ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి ఈ బిజినెస్ అనేది గొప్ప విషయమే. దీనిని బట్టి చూస్తుంటే.. అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.