English | Telugu

రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’కి షాకిచ్చిన లీకేజీ వీరులు

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌నే వార్త‌లు సినీ సర్కిల్స్‌లో బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ హీరోల‌కు పెద్ద పీట వేస్తూ వారితోనే సినిమాలు చేస్తూ వ‌చ్చిన శంక‌ర్ తొలిసారి తెలుగు హీరో, నిర్మాత‌ల‌తో క‌లిసి భారీ పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా అల‌రించ‌నుంది. శంకర్ సినిమా విష‌యంలో ఎంత కేర్ తీసుకుంటార‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటిది ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ సాంగ్ లీకైన‌ట్లు న్యూస్ వినిపిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నుంచి ఓ సాంగ్‌లో కొంత భాగం లీకైంది. అయితే ఇది ర‌ఫ్ వెర్ష‌న్ మాత్ర‌మే అని, ఫైన‌ల్ సాంగ్ కాద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు కూడా. ఏదైతేనేం శంక‌ర్ సినిమా నుంచి ఫుటేజీ లీక్ కావ‌టం అనేది ఇప్పుడొక హాట్ టాపిక్‌గా మారింద‌నే చెప్పాలి. ఇది ద‌ర్శ‌కుడే కాదు ఎంటైర్ యూనిట్‌ను కంగారు పెడుతుంది. మ‌రిప్పుడు శంక‌ర్ మ‌రింత జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తార‌న‌టంలో సందేహం లేదు.

‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర సీఎం కాగా.. మ‌రో పాత్ర ఎన్నిక‌ల అధికారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని హీరోయిన్‌. విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఇంకా సునీల్‌, శ్రీకాంత్, ఎస్‌.జె.సూర్య వంటి భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.