English | Telugu

పుష్ప 2.. ప్రతి సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది!

'పుష్ప'కి రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాటలతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సుకుమార్ గారు రాసిన కథ అద్భుతంగా ఉంది. ఆయన నేరేట్ చేస్తుంటే చప్పట్లు కొడుతూనే ఉన్నాం. ప్రతి సీన్ ఇది ఇంటర్వెల్ సీనా అని అనుకునేలా ఉంటుంది." అన్నాడు. దేవి మాటలను బట్టి చూస్తే, ప్రతి సీన్ ఇంటర్వెల్ లా అంటే సుకుమార్ ఏ రేంజ్ లో సీన్స్ రాశారో అర్థం చేసుకోవచ్చు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.