English | Telugu

రాజమౌళి "ఈగ" కి మళ్ళీ సెంథిల్

రాజమౌళి దర్శకత్వంలోని "ఈగ" చిత్రానికి మళ్ళీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వచ్చారు. ఈ "ఈగ" చిత్రానికి ముందుగా జేమ్స్ పౌల్ ని కెమెరామేన్ గా ఎన్నుకున్నారు.కానీ రాజమౌళి వర్కింగ్ స్టైల్ కి అతనికీ కుదరక పోవటంతో సెంథిల్ కుమార్ నే రాజమౌళి రమ్మని కబురు పంపారట. రాజమౌళి, సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి, యమదొంగ, మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అదీ గాక ఆ మధ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించగా వచ్చిన "అరుంధతి" చిత్రానికి కూడా సెంథిల్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.

రాజమౌళి "ఈగ" చిత్రంలో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం, సెంథిల్ గతంలో రాజమౌళితో పనిచేసి ఉండటం వల్లా, రాజమౌళికి ఏం కావాలో సెంథిల్ తేలికగా గ్రహించగలడని, ఆ విధమగా రిజల్ట్ అందించగలడని "ఈగ" చిత్రానికి రాజమౌళి మళ్ళీ సెంథిల్ నే తీసుకోవటం జరిగిందట. మరి రాజమౌళి, సెంథిల్ కాంబినేషన్ లో రాబోతున్న "ఈగ" చిత్రం విజువల్ ఫీస్ట్ అవుతుందనటంలో సందేహం అక్కర్లేదు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.