English | Telugu

క‌మ‌ల్‌హాసన్ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌?

ది లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వ‌చ్చేసింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ ఓ సినిమాలో న‌టిస్తున్నారు. దాదాపు 36 ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తోంది. 1987లో విడుద‌లైన క‌ల్ట్ క్లాసిక్ సినిమా నాయ‌క‌న్‌, త‌ర్వాత ఈ కాంబోలో సినిమా అన‌గానే అంద‌రూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. టెంటేటివ్‌గా ఈ ప్రాజెక్టుకు కేహెచ్‌234 అనే టైటిల్ న‌డుస్తోంది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యంగ్ హీరోలు కూడా న‌టించ‌నున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, జ‌యం ర‌వికూడా కీ రోల్స్ లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఫీమేల్ లీడ్‌గా త్రిష పేరు ఎప్ప‌టి నుంచో వినిపిస్తూనే ఉంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, జ‌యం ర‌వి కేర‌క్ట‌ర్ల గురించి చిత్ర యూనిట్ మాత్రం ఇప్ప‌టిదాకా నోరు విప్ప‌లేదు. అయితే ఇద్ద‌రూ క‌థ విన్నార‌ని, సినిమా చేయ‌డానికి త‌మ సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశార‌ని టాక్‌. ఇంకా డాటెడ్ లైన్స్ లో సైన్ చేయ‌లేద‌న్న విష‌యం కూడా ప్ర‌చారంలో ఉంది.

పొన్నియిన్ సెల్వ‌న్ ఫ్రాంఛైజీ త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో జ‌యం ర‌వి న‌టిస్తున్న సినిమా అవుతుంది. అలాగే ఓకే క‌న్మ‌ణి త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న సినిమా అవుతుంది. అటు జ‌యం ర‌విగానీ, ఇటు దుల్క‌ర్ స‌ల్మాన్‌గానీ, ఇప్ప‌టిదాకా క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌లేదు. వీరిద్దరూ లోక‌నాయ‌కుడితో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఫ‌స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌తో త్రిష ఆల్రెడీ ప‌నిచేశారు. మ‌ణిర‌త్నంతోనూ ప‌నిచేశారు. ఈ సినిమా వారిద్ద‌రితో త్రిష‌కు హ్యాట్రిక్ సినిమా అవుతుంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఉంటుంద‌ట స‌బ్జెక్ట్. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం ఇద్ద‌రూ క‌లిసి నిర్మిస్తున్నారు. జి.మ‌హేంద్ర‌న్‌, శివ అనంత్ కూడా నిర్మాత‌లే. వినాయ‌క‌చ‌వితిని పుర‌స్క‌రించుకుని ఈ సినిమాకు సంబంధించిన మాసివ్ అప్‌డేట్ ఇవ్వ‌డానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.